కొండగట్టు దేవస్థానంలో చోరి...

కొండగట్టు దేవస్థానంలో చోరి...
  • స్వామి వారి వెండి మాకరతోరణం, ఇతర వస్తువులు ఎత్తుకెళ్లిన దొంగలు...
  • రంగంలోకి దిగిన పోలీసులు... 

ముద్ర, మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో దేవస్థానంలో చోరి జరిగింది. దేవస్థానంలోని ప్రధాన ఆలయం తాళాలు పగులగొట్టి స్వామి వారి వెండి మాకరతోరణం, ఇతర వెండి వస్తువులు దోoగిలించినట్లు తెలిసింది. వేకువజామున సుప్రభాత సేవకు వచ్చిన అర్చకులు దొగతనం జరిగినట్లు గుర్తించి, అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న పోలీసులు భక్తుల దర్శనం నిలిపివేసి, ఆలయం ముసివేశారు. Dsp ఆధ్వర్యంలో పోలీసులు, క్లూస్ టీం విచారణ చేస్తున్నారు. సిసి పుటేజ్ పరిశీలిస్తున్నారు. దాదాపు 9 లక్షలు విలువ గల వస్తువులు మాయమైనట్లు తెలిసింది.