ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిపై హత్యాయత్నం

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిపై హత్యాయత్నం

సారంగాపూర్ ముద్ర: కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిపై హత్యాయత్నం చేసిన సంఘటన మండలంలోని కమ్మునురు గ్రామం లో చోటుచేసుకుంది. స్థానికులు పోలీసు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కండ్ల పెళ్లి గ్రామానికి చెందిన నారపాక కమలాకర్ అతని కూతురును తీసుకొని నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలో జరిగే వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుండి బయలుదేరాడు. మండలంలోని కమ్మనూరు బ్రిడ్జి వద్దకు రాగానే అప్పటికే అతని కోసం వెయిట్ చేస్తున్నా జీవు ఒక్కసారిగా అతని గుద్దడానికి ముందుకు వచ్చింది. తన ద్విచక్ర వాహనం మరింత వేగంతో ముందుకు వెళ్తుండగా మరొకసారి గుద్దడంతో తన కూతురుతో సహా కింద పడిపోయాడు. దీంతో జీబు లోని ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న కత్తిని తీసుకొని నారపక కమలాకర్ కత్తితో  దాడి చేసి శరీరంపై గాయాలు చేశాడు.

అప్రమత్తమైన కమలాకర్ ఆ వ్యక్తి చేతిలోని కత్తిని తీసుకొని అతనిపై కత్తితో దాడి చేశారు తీవ్ర గాయాలు కావడంతో సదరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు బీర్పూర్ పోలీసులకు సమాన సమాచారం అందించడంతో స్పందించిన ఎస్సై అజయ్ సంఘటన స్థలానికి చేరుకొని దాడి చేయడానికి వచ్చిన వ్యక్తులు జన్నారంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం జగిత్యాల లోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స నిర్వహిస్తున్నట్లు తెలిసింది. కాగా ఈ సంఘటనపై ఇప్పటివరకు ఎలాంటి  ఫిర్యాదు రాలేదని ఎస్ఐ అజయ్ తెలిపారు. వివాహేతర సంబంధం విషయంలోనే కమలాకర్ పై దాడి జరిగి ఉండొచ్చని ఆరోపణలు వినిపిస్తున్నాయి.