ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

హుజూర్ నగర్ టౌన్ ముద్ర; SI పి. హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం హుజూర్ నగర్ పట్టణానికి చెందిన కుమ్మరి కుంట్ల నాగేశ్వరరావు(50) కు భార్య లత ,ఇద్దరు కుమారులు. నాగేశ్వరరావు గత కొన్ని సంవత్సరాలుగా గాంధీ పార్క్ చౌరస్తాలో కూల్ డ్రింక్ షాప్ తో పాటు బజ్జీల బండి వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఈ మధ్యన బాగా త్రాగుడుకు బానిసై సరిగా వ్యాపారం చేయకుండా భార్య పిల్లలతో తరచూ గొడవ పడుతూ ఎంత చెప్పినా వినకుండా మద్యం మత్తులో ఈరోజు భార్య, పిల్లలు షాపుకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని చనిపోయాడు. భార్యలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.