పశువైద్య కళాశాల కోసం స్థల పరిశీలన చేసిన  కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ 

పశువైద్య కళాశాల కోసం స్థల పరిశీలన చేసిన  కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ 

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :  సిద్దిపేట సమీకృత జిల్లా కార్యలయ సముదాయ సమీపంలో 30 ఎకరాల విస్థిర్ణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపడుతున్న పశువైద్య కళాశాల కోసం కేటాయించిన ప్రాంతాన్ని  జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్  మంగళవారం రోజున పరిశీలించారు. టిఎస్ఎంఎస్ఐడిసి ఇంజనిర్ అధికారులు, నిర్మాణ ఏజెన్సీ, పశువైద్య యూనివర్సిటీ బృందం, ఎడి సర్వేయర్, స్థానిక తహసిల్దార్ అందరు కలిసి మ్యాప్ ద్వారా కళాశాల నిర్మాణం గుర్చి పరిశీలించారు. కళాశాల ఆవరణ చుట్టూ 10 మీటర్ల ఒకటి చొప్పున స్తంభాలు పాతాలని ఎడి సర్వేయర్ వినయ్ కుమార్ ను  కలెక్టర్  ఆదేశించారు. ఆవరణలో ఉన్న పెద్ద పెద్ద కరెంట్ స్తంభాలు తియ్యడానికి డిమాండ్ నోటిస్ తయారు చేయ్యాలని విద్యుత్ శాఖ ఎస్ఇకి తెలిపారు. భవిష్యత్తు తరాలకు అనుగుణంగా నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. నిర్మాణ ఎస్టిమేట్ టెండర్ ను పైనల్ చేయాలని ఆయన సూచించారు. స్థలాన్ని చదును తర్వాత అతి త్వరలో  మంత్రి హరీష్ రావు చే శంకుస్థాపన కార్యక్రమానికి సిద్ధం చెయ్యాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.