గోపాల్ పూర్ లో  7కేజీల  ఎండుగంజాయి సీజ్ 

గోపాల్ పూర్ లో  7కేజీల  ఎండుగంజాయి సీజ్ 
  • ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన గజ్వేల్ ఎక్సైజ్ పోలీసులు

   
ముద్ర ప్రతినిధి :సిద్దిపేట:-ఎక్సైజ్ శాఖ అధికారుల తనిఖీల్లో 7 కిలోల ఎండు గంజాయి పట్టుబడింది. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.జిల్లా ప్రోహిబిషన్ ఎక్సయిజ్ అధికారి శ్రీనివాస మూర్తి ఆదేశాల మేరకు గజ్వేల్ ఎక్సయిజ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మానంద రెడ్డి,ఎక్సయిజ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి  తమ సిబ్బందితో గురువారం నాడు జగదేవ్ పూర్ మండలం మునిగడప హమ్లెట్ గోపాల్ పుర్ లో తనిఖీలు నిర్వహించగా అక్కిరాజు  భాస్కర్ అనే వ్యక్తి ఇంట్లో 7 కేజీ ల ఎండు గంజాయి దొరికింది. గంజాయి వ్యాపారం తో సంబంధం ఉన్న అక్కరజు భాస్కర్, జాలి నగేష్ ఎన్ డి పి సి చట్టప్రకారం కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించారు తనిఖీలలో  హెడ్ కానిస్టేబుల్ నర్సింహులు, కానిస్టేబుల్స్ బాబు, కర్ణకర్, మౌనిక ,రేణుక ఇతర సిబ్బంది పాల్గొన్నారని ఎక్సయిజ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు.