డోర్నకల్ లో గవర్నర్ తమిళసై

డోర్నకల్ లో గవర్నర్ తమిళసై

ముద్ర ప్రతినిధి మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వేస్టేషన్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక, జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పర్యటన అనంతరం రైల్ లో  బయలుదేరి వెళ్లేందుకు గవర్నర్ తమిళసై డోర్నకల్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కు వచ్చిన సందర్భంగా ఆమెను కలెక్టర్ శశాంక, జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులు డాక్టర్ నెహ్రూరాథోడ్, పివిప్రసాద్, వెంకటరెడ్డి తదితరులు గవర్నర్ ను కలిసి మహబూబాబాద్ జిల్లాలో చేపడుతున్న రెడ్ క్రాస్ సొసైటీ కార్యక్రమాలను వివరించారు. అనంతరం గవర్నర్ రైల్ లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.