వివేకా హత్య కేసుపై కోర్టు సంచలన ఆదేశాలు..

వివేకా హత్య కేసుపై కోర్టు సంచలన ఆదేశాలు..

ముద్ర,ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకా హత్య కేసుపై కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. వివేకా హత్య కేసుపై ఎవరు మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఆంక్షలు పెట్టింది. కాగా ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసుపై ప్రధాన పార్టీల మధ్య డైలాగ్‌ వార్‌ నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కడప వైసీపీ అధ్యక్షుడు సురేష్‌ బాబు కోర్టు ఆశ్రయించారు. ఎన్నికల నేపథ్యంలో వివేకా హత్యపై మాట్లాడొద్దంటూ వై.ఎస్.షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, పురంధేశ్వరి, నారా లోకేష్ లకు కోర్టు సూచనలు చేసింది.