వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన టీడీపీ ఛీప్ చంద్రబాబు నాయుడు

వాలంటీర్లకు  గుడ్ న్యూస్ చెప్పిన టీడీపీ ఛీప్ చంద్రబాబు నాయుడు

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఏపీ వాలంటీర్లకు టీడీపీ ఛీప్ చంద్రబాబు నాయుడు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతామని ప్రకటించారు టీడీపీ ఛీప్ చంద్రబాబు నాయుడు.వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని వారిని కొనసాగిస్తామని తెలిపారు.ప్రజలందరికీ ప్రగతితో పాటు సాధికారత రావాలి అన్నారు చంద్రబాబు నాయుడు.

ఉగాది పర్వదినం సందర్భంగా చంద్రబాబు పంచాంగ కర్త మాచిరాజు వేణుగోపాల్ నేతృత్వంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో త్రిమూర్తుల కలయికతో ఏపీకి మేలు జరుగుతుందని తెలిపారు. 128 అసెంబ్లీ, 24 లోక్ సభ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పారు. చంద్రబాబుకు అధికార యోగం ఉందని వివరించారు.