పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్న బండి

పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్న బండి

ముద్ర ప్రతినిధి కరీంనగర్: వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులను బిజెపి స్టేట్ చీఫ్, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పరామర్శిస్తున్నారు. కరీంనగర్ రూరల్ మండలం ఫకీర్ పేట, చామనపల్లి, చొప్పదండి మండలం వెదురు గట్ట గ్రామాలలో అకాల వర్షంతో నేలకూలిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దు అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.