పొర్లు దండాలతో బాధితుల నిరసన

పొర్లు దండాలతో బాధితుల నిరసన

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తమ సమస్యను పరిష్కరించటంలో అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా రైతు కుటుంబం పొర్లు దండాలతో నిరసన వ్యక్తం చేసిన ఘటన నిర్మల్ లో సోమవారం చోటు చేసుకుంది. జిల్లాలోని లోకేశ్వరం మండలం కనకాపూర్ కు చెందిన కొబ్బనోళ్ళ గంగన్న భూమిని అబ్దుల్లాపూర్ వి డి సి సభ్యులు ఆక్రమించారని గంగన్న ఫిర్యాదు చేశారు. తహసిల్దార్ స్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవటం తో  కలెక్టర్ కార్యాలయ ఆవరణ నుండి ప్రజా ఫిర్యాదుల విభాగం వరకు తన కుటుంబ సభ్యులతో కలిసి పొర్లు దండాలు పెడుతూ వెళ్లి వినతిపత్రం అందజేశారు.