కృష్ణుడి వేషంలో  కేసీఆర్ చిత్రపటంలో వినూత్న నిరసన

కృష్ణుడి వేషంలో  కేసీఆర్ చిత్రపటంలో వినూత్న నిరసన

ముద్ర ప్రతినిధి, నిర్మల్ : సర్వశిక్షాఅభియాన్ లో పని చేస్తున్న సిబ్బందిని క్రమబద్ధీకరించాలని కోరుతూ కొద్ది రోజులుగా వారు సమ్మె కొనసాగిస్తున్నారు. తమ నిరసనలో భాగంగా నిర్మల్ లో గురువారం కృష్ణాష్టమి వేడుకలు జరిపి ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. అయితే ఇందులో సీఎం కేసీఆర్ ను కృష్ణుని వేషంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తో నిరసన వ్యక్తం చేశారు. కనీసం ఈ పండగ రోజైనా తమ డిమాండ్లను పరిష్కరించేలా కేసీఆర్​కు ఆలోచన ఇవ్వాలని వేడుకున్నారు.