సబ్ స్టేషన్ పనులకు మంత్రి భూమిపూజ

సబ్ స్టేషన్ పనులకు మంత్రి భూమిపూజ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా సోన్ మండలం మాధాపూర్ లో నిర్మించబోయే 33/11 కే వి సబ్ స్టేషన్ పనులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం శంఖుస్థాపన చేశారు. ఈ సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ. 1.11 కోట్లు వ్యయమవుతాయని అంచనా.  ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.