అంధులను కూడా వదలని దొంగలు

అంధులను కూడా వదలని దొంగలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నేటి సమాజంలో మానవత్వం మచ్చుకు కూడా లేకుండా పోయింది. కనీసం అంధులు అన్న కనికరం కూడా లేకుండా దొంగలు బాసరలో రైల్వే స్టేషన్లో నలుగురు అంధ ప్రయాణికులను దోచుకున్నారు. వివరాల్లోకి వెళితే ఔరంగాబాద్ కు చెందిన నలుగురు సభ్యులున్న అంధ కుటుంబం బాసరలో అమ్మవారి దర్శనం అనంతరం తిరుమల లో శ్రీవారి దర్శనానికి బయలుదేరి బాసర చేరారు. బాసరలో దర్శనం అనంతరం ప్రయాణికుల వెయిటింగ్ రూం లో ఉన్న వీరి వద్ద నుంచి గుర్తింపు పత్రాలు, ఇతర డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్, కొంత నగదు అపహరించుకొని వెళ్లారు.