దిలావర్ పూర్ వద్ద  90 కేజీ ల గంజాయి పట్టివేత

దిలావర్ పూర్ వద్ద  90 కేజీ ల గంజాయి పట్టివేత
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ టోల్ ప్లాజా సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 90 కేజీల గంజాయిని పట్టుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా వాహనాలు పరిశీలిస్తున్న సమయంలో హోండా సిటీ వాహనంలో మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న ఈ గంజాయిని స్వాధీనపరుచుకున్నట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు.
ఈ గంజాయిని భద్రాచలంలో కొనుగోలు చేసి మహారాష్ట్ర కు తరలిస్తున్నట్టు ఆయన వివరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కు చెందిన ఆరిఫ్, అన్వర్ అదుపులోకి తీసుకున్నామని మరో ముగ్గురు పరారీలో ఉన్నారని సి ఐ వివరించారు. పట్టుకున్న గంజాయి విలువ దాదాపు రూ. 18 లక్షలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.