ఖానాపూర్ లో కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం

ఖానాపూర్ లో కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు వ్యతిరేకంగా ఖానాపూర్ లో సీఎం కెసిఆర్ దిష్టిబొమ్మను బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేత, పెంబీ జెడ్పీటీసీ జానకి రమేష్ మాట్లాడుతూ ప్రతి పరీక్షలో లీకేజీలు సాధారణం అన్న రీతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. తమ తప్పిదాలను కప్పిపుచ్చు కోవడానికి ప్రతిపక్షాలపై కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు