ఘనంగా శ్రీ సాయి అఖండ నామ సంకీర్తన ప్రారంభం...

ఘనంగా శ్రీ సాయి అఖండ నామ సంకీర్తన ప్రారంభం...

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల కృష్ణానగర్ లోని స్థానిక శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో శుక్రవారం నుండి శ్రీ సాయి అఖండ నామ సంకీర్తన  వేద పండితులు బ్రహ్మశ్రీ తిగుళ్ల విషు శర్మ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.  వారం రోజుల పాటు నిర్విరామంగా సాయి అఖండ నామ సంకీర్తన సాగుతుందని, 1008 కలశ స్థాపన నిర్వహించి వారం రోజుల పాటు నిత్య పూజలు అందుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. శ్రీ రామ నవమి మరుసటి రోజున బాబా కు 1008 కలశాల గంగాజలం మరియు షోడశ ఫలరసాభిషేకం కలదని భక్తులు అధిక సంఖ్యలో బాబా నామ సంకీర్తనలో పాల్గోని బాబా కృపకు పాత్రులు కాగలరని ఆలయ చైర్మన్ డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల డి ఎస్ పి రత్నపురం ప్రకాష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మకర్తలు నాగుల కిషన్ గౌడ్, ఎలుగందుల సత్య నారాయణ, మార కైలాసం, అయిల్నేని రాం కిషన్ రావు,కళాశ్రీ గుండేటి రాజు, తవుటు రవి, కంచి కిషన్, పూజారులు వేణు మాధవ చార్య, సంజయ్, పంజాల తిరుపతి గౌడ్ తదితరులు హాజరయ్యారు.