బి ఆర్ ఎస్ పార్టీ నూతన వార్డు కమిటీ నియామకం

బి ఆర్ ఎస్ పార్టీ నూతన వార్డు కమిటీ నియామకం

ముద్ర, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని 22 వ వార్డ్ లో, ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పాడి శ్రీ కౌశిక్ రెడ్డి  ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్లపెల్లి రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో  22 వ వార్డ్ కౌన్సిలర్ గుల్లి పూలమ్మమొగిలి ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ వార్డ్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది వార్డ్ అధ్యక్షులుగా మంద రాజేష్, ఉప అధ్యక్షులుగా గుల్లి రమేష్, యూత్ కమిటీ అధ్యక్షులుగా వడ్లూరి శశికుమార్, సోషల్ మీడియా అధ్యక్షులుగా గుల్లి కృష్ణవంశీ, SC సెల్ అధ్యక్షులుగా ఎర్ర వెంకటేష్, మహిళా అధ్యక్షురాలుగా గుల్లి భాగ్యమ్మ, మైనారిటీ అధ్యక్షులు గా MD సల్మాన్ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ నియామకానికి కృషి చేసిన 22వ వార్డ్ సభ్యులందరికి, 22 వ వార్డ్ బి ఆర్ ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షులు గుల్లి ప్రతాప్  ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.