రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారం అందించాలి కాంగ్రెస్ నాయకుడు ఎండి సాహెబ్ హుస్సేన్

రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారం అందించాలి కాంగ్రెస్ నాయకుడు ఎండి సాహెబ్ హుస్సేన్

ముద్ర, వీణవంక
      అకాల వర్షం కారణంగా మండలంలోని అనేక గ్రామాలలో రైతుల  సాగు చేసిన మొక్కజొన్న ,వరి పంటలు దెబ్బతిన్నాయని మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్ అన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కేసీఆర్ రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి స్పందించి అధికారుల ద్వార పంట నష్టం అంచనాలు వేసి చేతులు దులుపుకోకుండా, రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. లేనట్లయితే రాబోయే రోజుల్లో రైతులను కలుపుకొని కాంగ్రెస్  పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు.