గంజాయి అమ్ముతున్న ఇద్దరి  పట్టివేత

గంజాయి అమ్ముతున్న ఇద్దరి  పట్టివేత

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : ఇద్దరు గంజాయి విక్రేతలను గురువారం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుండి 2 కిలోల గంజాయి, సెల్ ఫోన్ న్లను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ లోని కోతి రాంపూర్ లో నివాసం ఉంటున్న బీహార్ రాష్ట్రంలోని బిర్న వన్ దోస్ట్ కు చెందిన గుడ్డు కుమార్, సిక్ వాడిలో నివాసం ఉంటున్న చందన్ కుమార్ మిశ్రాలను పట్టుకున్నారు. వీరిని కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఈ దాడిలో ఇన్స్పెక్టర్లు సృజన్ రెడ్డి, రవికుమార్, ఎస్ఐ రఘుపతి, ఏఎస్ఐ నర్సయ్య లతో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు.