మృతుడి కుటుంబానికి.. సూపరిండెంట్ చేయూత

మృతుడి కుటుంబానికి.. సూపరిండెంట్ చేయూత

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: 15 రోజుల వ్యవధిలో కుటుంబంలో  తండ్రి, కొడుకు మృతి చెందగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబానికి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సుగుణాకర్ రాజు ఆర్థిక సహాయం అందించడంతోపాటు మృతుడి కూతురు సౌజన్య చదువుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తానేదర్ పల్లి గ్రామానికి చెందిన మాచర్ల రాజు కాలేయం వ్యాధితో, అతని కుమారుడు శ్రీరామ్ బోన్ క్యాన్సర్ తో గత రెండేళ్లుగా బాధపడుతు 15 రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి చెందారు.

విషయం తెలుసుకున్న జనగామ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరేండెంట్ సుగుణకర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కూతురు సౌజన్యకు ఆర్ధిక సహాయం చేశారు. సౌజన్యకు ఉన్నత చదువులకు సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు మాచర్ల గణేష్, మార్కెట్ వైస్ చైర్మన్ చల్లా చందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.