15 జిల్లాల కలెక్టర్లు బదిలీ..

15 జిల్లాల కలెక్టర్లు బదిలీ..

రాష్ట్రలో 15 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల భారీగా ఐపీఎస్​ లను బదిలీ చేసిన ప్రభుత్వం.. తాజాగా ఐఏఎస్​ ల బదిలీ ప్రక్రియ చేపట్టింది. దీనిలో భాగంగా ముందుగా 15 జిల్లాల కలెక్టర్లను ట్రాన్స్​ఫర్​ చేశారు. రంగారెడ్డి కలెక్టర్​, హైదరాబాద్​ ఇంచార్జీ కలెక్టర్​ గా ఉన్న అమోయ్​ కుమార్​ ను మేడ్చల్​ మల్కాజిగిరి కలెక్టర్​ గా ట్రాన్స్​ఫర్​ చేశారు. హైదరాబాద్​ ఇంచార్జీ కలెక్టర్​ గా కొనసాగనున్నారు. అదే విధంగా మహబూబూనగర్​, హన్మకొండతో పాటుగా పలు జిల్లాల కలెక్టర్లను ట్రాన్స్​ఫర్​ చేశారు.