పెద్దమ్మతల్లి ని దర్శించుకున్న యం పి బండి సంజయ్

పెద్దమ్మతల్లి ని దర్శించుకున్న యం పి బండి సంజయ్

గన్నేరువరం ముద్ర:  గన్నేరువరం మండలం లోని గునుకుల కొండాపూర్ (చోక్కల్లపల్లి) గ్రామంలో పెద్దమ్మ  తల్లి జాతర అంగరంగ వైభవంగా జరగగా గురువారం రోజున పెద్దమ్మ తల్లిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం మైలారం గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట, బోనాల జాతర కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు, ఆయన వెంట బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ, బీజేవైఎం నాయకులు యువక్రాంతి, మండల అధ్యక్షుడు నగనూరు శంకర్, ఆలయ కమిటీ చైర్మన్ గుర్రం వాసు, వైస్ చైర్మన్ పైడిపల్లి శ్రీనివాస్, బొమ్మ మహేష్, మండల సోషల్ మీడియా కన్వీనర్ మచ్చ మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.