ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వం

ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వం

ముద్ర, జమ్మికుంట :కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 9 సంవత్సరాల పాలనలో బడుగు బలహీన వర్గాల, పేద ప్రజల సంక్షేమం గాలికొదిలి కార్పొరేట్లకు పెట్టుబడుదారులకు అనుకూలమైన  చట్టాలు చేస్తూ ధనవంతులను మరింత ధనవంతులుగా, పేదవారిని మరింత పేదరికంలోకి బిజెపి ప్రభుత్వం నెట్టివేస్తుందని సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి ఆరోపించారు.బుధవారం రోజున జమ్మికుంట మోత్కులగూడెం చౌరస్తాలోని పార్టీ కార్యాలయంలో శాఖ కార్యదర్శిల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికుల పుట్టగొట్టే జీవోలు తీసుకొచ్చిందని, 44 లేబర్ కోళ్లను నాలుగు కోళ్లుగా తెచ్చిందన్నారు,పని గంటల పెంపు తగదన్నారు.రైతుల పొట్టగొట్టే మూడు నల్ల చట్టాలు తెచ్చిందని రైతులు సంవత్సరం కాలం పాటు ఢిల్లీ నడిబొడ్డున సమరశీల పోరాటాలు నిర్వహించిన నేపథ్యంలో ఆ చట్టాలు రద్దు చేసినట్లు ప్రకటించారని, ఇప్పటికీ రైతుల భూములను కార్పొరేట్లకు అప్పజెప్పే కుట్రలు కొనసాగుతున్నాయి అన్నారు.తాము అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బిజెపి ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడబెరికిందన్నారు. బేటి బచావో బేటి పడావో అన్న నినాదం కేవలం నినాదం గానే బిజెపి చూస్తుందన్నారు.దేశ ప్రతిష్ఠను, కీర్తిని వ్యాపింపజేసే మహిళా రెజ్లర్లపై బిజెపి ఎంపీ లైంగిక వేధింపులకు పాల్పడడం సిగ్గుచేటు అన్నారు.

సుమారు రెండు నెలలుగా వేధింపులకు గురి చేస్తున్న సదరు ఎంపీపై చర్యలు తీసుకోవాలని క్రీడాకారులు  ఢిల్లీ నడిబొడ్డున శాంతియుత ఆందోళన నిర్వహిస్తుంటే బిజెపి ప్రభుత్వం తమకు ఎంత మాత్రం పట్టనట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. వెంటనే సదరు ఎంపీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు.డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించినవి వెంటనే అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.57 సంవత్సరాల దాటిన ప్రతి వ్యక్తికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని, నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని రేషన్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.ఇంటి స్థలం లేని పేదలకు ఇంటి స్థలం కేటాయించి గృహ నిర్మాణానికి ఐదు లక్షలు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏకకాలంలో లక్ష రూపాయల రైతు రుణమాఫీ ప్రకటించి అమలు చేయాలని, కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో పై సమస్యల పరిష్కారం కొరకు అర్హులైన పేదలు సిపిఎం నిర్వహించే ఆందోళన పోరాటాలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సిపిఎం జోన్ కార్యదర్శి శీలం అశోక్, జోన్ కమిటీ సభ్యులు కొప్పుల శంకర్, చెలుపురిరాములు, జక్కుల రమేష్, బాసిర సంపత్ రావు , శ్రీకాంత్,  సమ్మయ్య,  తదితరులు పాల్గొన్నారు.