మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన జిల్లా వైయస్సార్ టిపి నాయకులు

మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన జిల్లా వైయస్సార్ టిపి నాయకులు

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా వికారాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాకు చెందిన వైఎస్ఆర్టిపి ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైయస్సార్ టిపి వికారాబాద్  జిల్లా అధ్యక్షులు ఉప్పరి ప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి కావలి వసంత్ కుమార్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు కే వరప్రసాద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు రజిని, జిల్లా పొదుపు సంఘాల అధ్యక్షురాలు పద్మ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు  సుజాత,జిల్లా యూత్ ప్రెసిడెంట్ వేణుగోపాల్, జిల్లా క్రిస్టియన్స్ అధ్యక్షులు బందెయ్య, మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ ఎండి అజీజ్ లు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్  సమక్షంలో వైయస్సార్ తెలంగాణ  పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ప్రసాద్ కుమార్    కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.