ఏసీబీ వలలో బాన్సువాడ సబ్ రిజిస్ట్రార్ 

ఏసీబీ వలలో బాన్సువాడ సబ్ రిజిస్ట్రార్ 
  • రూ.9 వేలు తీసుకొంటూ...                        

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:ఏసీబీ వలలో మరో అధికారి చిక్కారు. బాన్సువాడ సబ్ రిజిస్ట్రార్ సతీష్ ఒకరి నుంచి లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తన అమ్మ పేరుపై ఉన్న ఇంటిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ రూ.15 వేలు డిమాండ్ చేశారు. రూ.9 వేలకు బేరం కుదరగా, బుధవారం నాడు మధ్య వర్తి సాయంతో రూ.9 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీకి పట్టుబడ్డారు.  బాధితుడు మహేష్ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. విచారణ కొనసాగుతోంది.