బి ఆర్ ఎస్ దోపిడీ దౌర్జన్యాల రాజ్యం నుంచి విముక్తి 

బి ఆర్ ఎస్ దోపిడీ దౌర్జన్యాల రాజ్యం నుంచి విముక్తి 
  • షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ 
  • కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన సిపిఐ

ముద్ర, షాద్‌నగర్:- దోపిడి దౌర్జన్యాల బి ఆర్ ఎస్  సర్కార్ నుండి కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ప్రజలకు విముక్తి ప్రసాదిస్తుందని షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ అన్నారు.బీఆర్ఎస్ ఆటలు ఇక సాగవని  అయన పేర్కొన్నారు.

బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ నామినేషన్ సందర్భంగా పార్టీ శ్రేణులు అభిమానులతో కలిసి పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు.  నామినేషన్ ప్రక్రియ అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ మాట్లాడుతు కనివిని ఎరగని విదంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి గత పదేళ్లుగా బాధలు అనుభవిస్తున్నారని, కాంగ్రెస్ అధికారం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని వారి ఆశలు నెరవేరేలా కాంగ్రెస్ పార్టీ షాద్ నగర్ అసెంబ్లీలో విజయ డంకా మోగిస్తుందని అన్నారు. నియోజకవర్గంలో పాలకుల దోపిడీ దౌర్జన్యాల నుండి విముక్తి కల్పిస్తామని అన్నారు. గత పది ఏళ్లుగా ఒకే కుటుంబం ప్రజలను పాలిస్తూ ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని శంకర్ అన్నారు. పాలకులు ఎన్నో ఇబ్బందులకు గురిచేసినప్పటికీ అన్ని వర్గాలు ఎంతో సంయమనంతో టిఆర్ఎస్ ఓటమి కోసం ఎదురుచూస్తున్నారని, ఇప్పుడు ఈ ద్రోహుల భరతం పడతామంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని అన్నారు. ఈరోజు హాజరైన వేలాదిమంది ఆశీస్సులతో తాను గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ద్రోహులకు అప్పజెప్పితే రాచి రంపన పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు వెంకటరామిరెడ్డి విశాల శ్రావణ్ రెడ్డి మాజి జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి సుదర్శన్ గౌడ్ జమ్రుద్ ఖాన్, రమాదేవి ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు సర్పంచులు ఉప సర్పంచ్లు తోపాటు ఆయన విభాగాల యువ నాయకులు అందే మోహన్,  సిపిఐ నాయకులు పానుగంటి పర్వతాలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.