బైక్ పై నుండి పడి మాజీమంత్రి కొండా సురేఖకు గాయాలు.. 

బైక్ పై నుండి పడి మాజీమంత్రి కొండా సురేఖకు గాయాలు.. 

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో రాహుల్ గాంధీ పర్యటనలో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో మాజీమంత్రి కొండా సురేఖ బైక్ పైనుండి పడి గాయపడ్డారు. బైకు ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న కొండా సురేఖ బైక్ నడుపుతూ స్కిడ్ అయి పడిపోయారు. ఈ ప్రమాదంలో సురేఖకు గాయాలు కాగా వెంటనే హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం కొండా సురేఖ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.