ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

బాసర ముద్ర నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బాయ్స్ హాస్టల్ లోని నాలుగో అంతస్థులో ఫ్యాన్ కు ఉరేసుకొని బలవన్మరనానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ అనే విద్యార్థి బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అనూహ్యంగా ఆదివారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తోటి విద్యార్థులు అధికారులకు సమాచారం అందించారు. విద్యార్థి మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం భైంసా ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.