ఆదర్శ కమ్యూనిస్టు, ప్రజా నాయకుడు మహ్మద్ రజబ్ అలి

ఆదర్శ కమ్యూనిస్టు, ప్రజా నాయకుడు మహ్మద్ రజబ్ అలి

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఆదర్శ కమ్యూనిస్టు, ప్రజానాయకుడు మహ్మద్ రజబ్ అలి అని ఆయన సిద్ధాంతాలను సాధించడమే ఆయనకు నిజమైన నివాళిఅని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా అన్నారు. సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్ లో సోమవారం మహ్మద్ రజబ్ అలి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత రజబ్ అలి చిత్రపఠానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలోన ఆయన మాట్లాడుతూ రజబ్ అలీ తన కుటుంబం కంటే పోరాటానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. సుజాత నగర్ ఎమ్మెల్యేగా సుధీర్గకాలం పనిచేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతోపాటు అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా హరిజన, గిరిజనులకు అందుబాటులో ఉంటూ వారిలో ఒక వ్యక్తిగా మెలిగిన వ్యక్తి రజబలి అని కొనియాడారు. ఆదర్శవంతమైన రాజకీయాలను కొనసాగించిన ఆయనలాంటి వారిని నేటితరం స్పూర్తిగా తీసుకోవాలని ఆకాంక్షించారు.

పదవులకోసం కాకుండా సామాన్యుల కోసం పోరాడిన ప్రజానేత అని పేర్కొన్నారు. రజబ్ అలి ఆశించిన మార్పులు సమాజంలో ఇంకా రాలేదని వాటికోసం పోరాడాల్సిన అవసరం కమ్యూనిస్టు కార్యకర్తలపై ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై.శ్రీనివాసరెడ్డి, జిల్లా సమితి సభ్యులు దమ్మాలపాటి శేషయ్య, నాయకులు లక్ష్మి నారాయణ, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.