టెన్త్​ పేపర్​ లీకేజీ కేసులో ముగిసిన ఈటల విచారణ

టెన్త్​ పేపర్​ లీకేజీ కేసులో ముగిసిన ఈటల విచారణ

టెన్త్​ పేపర్​ లీకేజీ కేసులో ఈటల విచారణ ముగిసింది. నా సెల్​ ఫోన్​ పోలీసులు పరీశీలించారన్నారు. ప్రశాంత్​ నాకు హిందీ పేపర్​ పంపలేదని పోలీసులు నిర్థారించుకున్నారన్నారు.   పేపర్​ నేను ఎవరికీ షేర్​ చేయలేదని నిర్ధారించుకున్నారన్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు.

పేపర్​ లీకేజీ పచ్చి అబద్ధం. అది మాల్​ ప్రాక్టీస్​ మాత్రమే. టెన్త్​ హిందీ పేపర్​ వ్యవహారమంతా ప్రభుత్వ కుట్ర. లిక్కర్​ స్కామ్​, సుకేశ్​ డబ్బుల వ్యవహారం నుంచి డైవర్ట్​ చేయడానికి ఈ కుట్ర. కేసీఆర్​ కుట్రపూరితంగా మమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా, నిర్బంధాలకు గురిచేసినా భయపడమని అన్నారు.