టెన్త్ పేపర్ లీకేజీ కేసులో ముగిసిన ఈటల విచారణ
టెన్త్ పేపర్ లీకేజీ కేసులో ఈటల విచారణ ముగిసింది. నా సెల్ ఫోన్ పోలీసులు పరీశీలించారన్నారు. ప్రశాంత్ నాకు హిందీ పేపర్ పంపలేదని పోలీసులు నిర్థారించుకున్నారన్నారు. పేపర్ నేను ఎవరికీ షేర్ చేయలేదని నిర్ధారించుకున్నారన్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు.
పేపర్ లీకేజీ పచ్చి అబద్ధం. అది మాల్ ప్రాక్టీస్ మాత్రమే. టెన్త్ హిందీ పేపర్ వ్యవహారమంతా ప్రభుత్వ కుట్ర. లిక్కర్ స్కామ్, సుకేశ్ డబ్బుల వ్యవహారం నుంచి డైవర్ట్ చేయడానికి ఈ కుట్ర. కేసీఆర్ కుట్రపూరితంగా మమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా, నిర్బంధాలకు గురిచేసినా భయపడమని అన్నారు.