ప్రాణం తీసిన సెల్‌ఫోన్‌

ప్రాణం తీసిన సెల్‌ఫోన్‌

సెల్‌ఫోన్‌  మాట్లాడుతూ రైలుపట్టాలు దాటుతున్న యువకుడు రైలు ఢీకొని మృతిచెందాడు. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా గుడువాంజేరి పెరుమాళ్‌ ప్రాంతానికి చెందిన ఆదిత్య (28) చెన్నైలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.  

శుక్రవారం సాయంత్రం విధులు ముగించు కొని ఇంటికెళ్తూ, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ రైలుపట్టాలు దాటుతుండగా ఆ సమయంలో చెన్నై నుంచి తిరుచ్చికి వెళుతున్న పాండ్యన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొనడంతో తీవ్రగాయాలతో సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. ఈ ఘటనపై తాంబరం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.