శ్రీపతి బాబు ఆధ్వర్యంలో గులాబీ గూటికి

శ్రీపతి బాబు ఆధ్వర్యంలో గులాబీ గూటికి

మహాదేవపూర్, ముద్ర:  కాంగ్రెస్ పార్టీలోకి బలవంతంగా వెళ్ళిన కార్యకర్తలు సర్పంచ్ శ్రీపతిబాపు సమక్షంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తడకల రవి, అడుప శ్రీను, కడార్ల సంతు, తోట వెంకన్న, పుప్పాల మహేష్, కడార్ల రవి, రమేష్ లను అభినందిస్తున్నామని సర్పంచ్ శ్రీపతిబాపు అన్నారు.ఈ కార్యక్రమంలో బూత్ కమిటీల కన్వీనర్లు తోట సుధాకర్,చాగర్ల రవీందర్ తో పాటు పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మరో కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడుప మల్లయ్య, జోడు మహేందర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, నాయకుల తీరు నచ్చకనే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు అడుప మల్లయ్య తెలిపారు. పుట్ట మధు నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందని, మంథని నియోజకవర్గ అభివృధి,సంక్షేమం పుట్ట మధు గెలుపుతో ముడిపడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీపతిబాపు, ఉప సర్పంచ్ సల్మాన్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పెండ్యాల మమత, బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం నియోజకవర్గ ఇన్చార్జి కేదారి గీత, మహిళాఅధ్యక్షురాలు ఒడేటి స్వప్నలతో పాటు సీనియర్ మండల నాయకులు, పార్టీకార్యకర్తలు పాల్గొన్నారు.