కార్తీక పౌర్ణమి శివాలయం లో భక్తుల సందడి 

కార్తీక పౌర్ణమి శివాలయం లో భక్తుల సందడి 

ముద్ర ,వెంకటాపురం (నూ): శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక పౌర్ణమి, అందులోనూ సోమవారం కావడంతో ములుగు జిల్లా వెంకటాపురం మండలం లోని శివాలయం భక్తులతో కిటకిటలాడుతుంది.వేకువజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయం వద్దకు చేరుకుని గరళకంఠుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆలయం శివనామస్మరణతో మార్మోగుతుంది. పలుచోట్ల భక్తులు నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి కార్తిక దీపారాధన చేశారు.