ఐఎన్ టియుసి కార్మిక సంఘాన్ని గెలిపించాలి - ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ఐఎన్ టియుసి కార్మిక సంఘాన్ని గెలిపించాలి - ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:సింగరేణి ఎన్నికల్లో ఐఎన్ టియుసి కార్మిక సంఘాన్ని గెలిపించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కోరారు. సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం అయిన ఐఎన్టియుసి నాయకులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి 5 ఇంక్లైన్ లో సింగరేణి కార్మికులతో  గేట్ మీటింగ్ లో పాల్గొన్నారు. అనంతరం జయశంకర్ విగ్రహం వద్ద నున్న వర్క్ షాప్ లో, సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ప్రచారం నిర్వహించారు. ఈ నెల 27న జరిగే సింగరేణి ఎన్నికల్లో కార్మికులకులందరు ఐఎన్టీయూసీ కార్మిక సంఘ గడియారం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఐఎన్టీయూసీని గెలిపిస్తే ప్రభుత్వం ఎల్లవేళలా సింగరేణి కార్మికులకు అండగా ఉంటుందని భరోసాను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఐత ప్రకాష్ రెడ్డి, ఐఎన్టీయూసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, గణపురం మండలం ఐబి రోడ్డులోని చర్చిలో సోమవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని, కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కుల, మతాలకతీతంగా పండుగలను అత్యంత వైభవంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విభాగం వైస్ చైర్మన్ దూడపాక శంకర్, మండల అధ్యక్షులు రేపాక రాజేందర్, మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి చోట మియా, మత్స్యశాఖ చైర్మన్ మునగాల రమేష్, మండల సీనియర్ నాయకులు వడ్లకొండ నారాయణ గౌడ్, తాళ్లపెళ్లి భాస్కర్ రావు, గుజ్జ  గంగాధర్ రావు, పెండ్యాల సాంబయ్య, బుర్ర రాజగోపాల్, హనుమంతు, దూడపాక దుర్గయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు ఓరుగంటి కృష్ణ, వార్డు సభ్యులు మండ అశోక్, గంధం ఓధాకర్, యూత్ నాయకులు మాదాసు వరుణ్ గౌడ్, కార్తీక్, భరత్ తదితరులు పాల్గొన్నారు.