‘కొమ్మూరి’ జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలి
ముద్ర ప్రతినిధి, జనగామ : సీనియర్ జర్నలిస్ట్ మహేశ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనగామ కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వెంటనే క్షపాపణ చెప్పాలని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అధ్యక్షుడు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ జర్నలిస్టుగా పనిచేస్తున్న మహేశ్ విధి నిర్వహణలో భాగంగా బుధవారం జనగామలో జరిగిన రేవంత్రెడ్డి సభ కవరేజీకి వెళ్లాడు. ఈ క్రమంలో కొమ్మూరి వద్దకు వెళ్లిన మహేశ్ను ఆయన బెదిరించేలా మాట్లాడారని పేర్కొన్నారు. ప్రతాప్ రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకంటే ఆయన ప్రచారాన్ని బైకాట్ చేస్తామని ప్రెస్ క్లబ్ హెచ్చరించింది. ప్రతాప్రెడ్డి వ్యాఖ్యలపై నేడు విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులు నల్లా బ్యాడ్జ్ లు పెట్టుకుని నిరసన తెలపాలని నాగరాజు పిలుపునిచ్చారు.