పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.. ఏబీవీపీ డిమాండ్

పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.. ఏబీవీపీ డిమాండ్

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ మండల కన్వీనర్ పసునూరి సందీప్ కుమార్  నోడల్ అధికారికి ఫిర్యాదు చేశారు. మంగళవారం ఇక్కడ మాట్లాడుతూ జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రానికి చెందిన కొన్ని ప్రైవేటు పాఠశాలలు రెండవ శనివారం, ఆదివారం, సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని నోడల్ అధికారిని కోరారు. ఆయన వెంట కార్యదర్శి  కాసాని శ్రీకాంత్, పట్టణ కార్యదర్శి రాజు, వంశీ ఉన్నారు.