కాంగ్రెస్ పాదయాత్రను విజయవంతం చేయండి
![కాంగ్రెస్ పాదయాత్రను విజయవంతం చేయండి](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_63ff52ad60235.jpg)
- మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య
ముద్ర, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్ర కోసం ఎల్లారెడ్డిపేట మండలం నుండి 1500 మందిని సిరిసిల్లలో జరిగే బహిరంగ సభకు తరలిస్తామన్నారు. అలాగే మలకపేట రిజర్వాయర్ నుండి 9వ ప్యాకేజీ కింద ఇప్పటి వరకు పనులు పూర్తికాని కాలువను పరిశీలించమని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తామన్నారు.
ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయలేదని ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకల పెంపు తదితర అంశాలను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు.ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు రైతులు శ్రామికులు ఉద్యోగస్తులు యువత నిరుద్యోగులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలన్నారు.జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోతు రాజు నాయక్,మానక నాగరాజ్ యాదవ్, నాయకులు దండు శ్రీనివాస్,చిన్ని బాబు, ఇమామ్, పందిర్ల శీను, గంగన్న, సతీష్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గుండాడి రాంరెడ్డి,అనవెని రవి, మామిళ్ళ కిషన్,రమేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.