బీఆర్ఎస్ మాయ మాటలు నమ్మొద్దు: జనగామ కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి
ముద్ర ప్రతినిధి, జనగామ: బీఆర్ఎస్ చెబుతున్న మాయ మాటలు, మోసపు హామీలను నమ్మొద్దని జనగామ కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్రెడ్డి ప్రజలకు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జనగామ మండలం యశ్వంతపురం, శామీర్పేట, పసరమడ్ల, ఓబుల్ కేశపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలను వివరించారు.
దొంగ హామీలు ఇచ్చి 2014 ఎన్నికల్లో, 2018 ఎన్నికల్లో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. ఈసారి చేతి గుర్తుకు ఓటేసి కేసీఆర్ తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కొమ్మూరి వెంట భువనగిరి పార్లమెంట్ అబ్జర్వర్ శ్రీనివాస్ మన్నే తదితరులు ఉన్నారు.