పర్మిషన్లు లేకుండా పటాకుల అమ్మొద్దు: వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం
ముద్ర ప్రతినిధి, జనగామ: దీపావళి పండగ సందర్భంగా పటాకులు అమ్మే వ్యాపారులు తప్పనిసరిగా అన్ని అనుమతులు తీసుకోవాలని వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని వ్యాపారులతో ఆయన సమావేశం నిర్వహించారు. పటాకుల అమ్మకాల్లో అవలంభించాల్సిన విధివిధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వ్యాపారులకు వివరించారు. పర్మిషన్ లేకుండా ఎవరైనా పటాకుల అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐ శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.