హైందవ ధర్మాన్ని అందరూ ముందుకు తీసుకు వెళ్ళాలి … 

హైందవ ధర్మాన్ని అందరూ ముందుకు తీసుకు వెళ్ళాలి … 
  • దళిత గోవిందను విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలి
  • దేవాలయాల నిర్మాణల రూపకల్పనతో పాటు నిత్య దీప, దూప నైవేద్యం అందిచాము
  • టీటీడీ బోర్డు చైర్మన్ బి. కరుణాకర్‌రెడ్డి 

సనతాన ధర్మపరిరక్షణకు, వేద సంప్రదాయాలు కాపాడేందుకు, ప్రాచీన విలువలను కాపాడుకునేందుకు టీటీడీ పాలకమండలి కట్టుబడి పని చేస్తుందని టీటీడీ బోర్డు చైర్మన్ బి. కరుణాకర్‌రెడ్డి అన్నారు. హిమాయత్ నగర్ టీటీడీ లోకల్ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షుడిగా డీవీఆర్కే  ప్రసాద్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ రోజు బుధవారం  ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌తో పాటు నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాన నగరాల్లో ఉన్న ఆలయాలకు లోకల్ అడ్వయిజరీ కమిటీలను వేసి ఆలయాలను అభివృద్ధి పథంలో నడిపించేలా కృషి చేస్తున్నామని అన్నారు. గడిచిన నాలుగేళ్ళలో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సుమారు 2500లకు పైగా ఆలయాలను నిర్మించడంతో పాటు కొన్నింటిని పునర్నిర్మించామని అన్నారు.

ALSO READ: ఏసీబీ వలలో బాన్సువాడ సబ్ రిజిస్ట్రార్

వేద సంస్కృతిని కాపాడటంతో పాటు వేద విద్యార్థుల ఆర్ధిక స్థితిగతులు బాగుపడేలే ఎప్పటికప్పుడు టీటీడీ అనుబంధ విశ్వ విద్యాలయాలు కృషి చేస్తున్నాయని అన్నారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం తీసుకొచ్చేందుకు టీటీడీ ఆధ్వర్యంలోని హిందూ ధర్మప్రచార పరిషత్ ద్వారా నిత్యం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రానున్న రోజుల్లో వాటిని మరింతగా పెంచుతామని అన్నారు. డీవీఅర్కే ప్రసాద్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. రెండేళ్ల పాటు ఈ పదవీ బాధ్యతలు కొనసాగుతాయని హిమయత్ నగర్‌తో పాటు నగరంలోని ఆలయాల బాధ్యత కూడా ఇందులో ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన లోకల్ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షుడు డీవీఅర్కే ప్రసాద్‌ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష పదవిని కేటాయించినందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి, టీటీడీ బోర్డు చైర్మన్ బి. కరుణాకర్‌రెడ్ కృతజ్ఞతలు తెలిపారు. వంశీ రామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.