స్టేషన్‌ఘన్‌పూర్‌‌లో ఐలమ్మ విగ్రహం ఏర్పాటు

స్టేషన్‌ఘన్‌పూర్‌‌లో ఐలమ్మ విగ్రహం ఏర్పాటు
  •  ఏడు మండలాలకు ఐలమ్మ భవనాలు కృషి చేస్తా
  • ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

ముద్ర ప్రతినిధి, జనగామ: రాబోయే ఐలమ్మ జయంతి నాటికి స్టేషన్‌ఘన్‌పూర్‌‌ నియోజకవర్గ కేంద్రంలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, జిల్లాలోని ఏడు మండలాల్లో  ఆమె పేరు మీద భవనాల నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని తనతో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, శ్రీనివాస్ రెడ్డి కూడా సహకారాలు అందించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.

జనగామ జిల్లా కేంద్రంలో  తెలంగాణ రజక అభివృద్ధి దారుల మూడో రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరైన కడియం మాట్లాడుతూ ఐలమ్మ చరిత్ర గొప్పదని, అలాంటి చరిత్ర కలిగిన ఆమె విగ్రహాన్ని స్టేషన్‌ఘన్‌పూర్‌‌ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. సమావేశంలో పలువురు రజక  సంగం నాయకులు పాల్గొన్నారు.