ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ముద్ర ప్రతినిధి భువనగిరి :77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు  మంగళవారం భువనగిరి పట్టణ, మండలంలో  అన్ని గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, యువత కమిటీల ఆధ్వర్యంలో  జాతీయ జెండా ఆవిష్కరించి  ఘనంగా జరుపుకున్నారు.

  • బి.ఆర్.ఎస్. పార్టీ కార్యాలయంలో...

బిఆర్ఎస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని పార్టీ జిల్లా అధ్యక్షులు తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ రామకృష్ణా రెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి తెలంగాణ తల్లి పూల మాలలు  వేశారు. అనంతరం జాతీయ పథకానికి వందనం చేసి బిఆర్ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తలతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.

  •  మున్సిపల్ కార్యాలయంలో...

భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లె శేఖర్ రెడ్డి తో  కలిసి చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్ గౌడ్, జిల్లా రైతు సమన్వయ సంస్థ చైర్మన్ కొలుపుల అమరేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు  కిరణ్ కుమార్, కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.

  • భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో..

బిజెపి జిల్లా అధ్యక్షులు పివి శ్యాంసుందర్రావు ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం తిరంగి జెండా ఊపుతూ బైక్ ర్యాలీ ప్రారంభించారు . ఈ కార్య క్రమంలో   రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతం శెట్టి రవీందర్ ,పాశం భాస్కర్, గూడూరు నారాయణ రెడ్డి రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి నార్ల నర్సింగ్ రావు, ఉపాధ్యక్షులు చందా మహేందర్, మాయ దశారద, పట్నం శ్రీను, బలరాం,  రత్నపురం బలరాం, పట్నం కపిల్, డిఎల్ఎన్ గౌడ్ , సుర్వి లావణ్య, రత్నపురం శ్రీశైలం,పట్టణ అధ్యక్షులు పాదరాజు ఉమా శంకర్ రావు, ఉడుతా భాస్కర్,ఎంగిలి లక్ష్మణ్, వైజైంతి,కనుకుంట్ల రమేష్ ,తుమ్మల నగేష్ ,ఏర్పుల శివ, కిషన్ జీ,పల్లేపటి వేణు ,సంతోష్ నాగరాజు ,కొండల్ తదితరులు పాల్గొన్నారు.

  • కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో..

77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని జగదేవ్పూర్ చౌరస్తా నందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అండెం సంజీవ రెడ్డి  హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్, పిసిసి డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్, మాజీ భువనగిరి కాంగ్రెస్ ఇంచార్జ్ పోదంశెట్టి వెంకటేశ్వర్లు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్ గారు. మహిళ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ కౌన్సిలర్లు కైరం కొండ వెంకటేష్, వడిచర్ల కృష్ణ యాదవ్, ఎండి నజీమా సలావుద్దీన్, మాజీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోతంశెట్టి మంజుల, సేవాదళ్ జిల్లా చైర్మన్ పిట్టల బాలరాజ్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఎండి మజాహర్, మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి రఫీ ఉద్దీన్ గౌరీ, నాయకులు నక్కల ఆదినారాయణ,తాడూరి నరసింహ, సయ్యద్ ముల్తానీషా, జంగిటి వినోద్, గ్యాస్ చిన్న, ఎండి ఫయాజ్,ఆబెద్ అలి, భువనగిరి వెంకటరమణ, గుర్రాల శ్రీనివాస్, అంది నరేష్,ఎండి నజీర్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీఅధ్యక్షులు ఎండి అవేష్, పసుపులేటి సంతోష్, సాదం రాజు, వర్రే నరసింహ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.