అభివృద్ధికి మద్దతుగా బిఆర్ఎస్ లో చేరికలు

అభివృద్ధికి మద్దతుగా బిఆర్ఎస్ లో చేరికలు
  • భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

భూదాన్ పోచంపల్లి, ముద్ర:-అభివృద్ధికి మద్దతుగానే వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ లో చేరుతున్నారని భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటి పరిధిలోని ముక్తాపుర్ 1వ వార్డుకు చెందిన 100 మంది కార్యకర్తలు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరికయ్యారు .ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో చేరిన కార్యకర్తలు క్రమశిక్షణ నిబద్ధతతో పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రతీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, జెడ్పిటిసి కోట పుష్పలత మల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, వైస్ చైర్మన్ భాత్క లింగస్వామి , పిఎసిఎస్ చైర్మన్ కందాడి భూపాల్ రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్లు కొంగరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.