విలేఖరి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

విలేఖరి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

ముద్ర ప్రతినిధి భువనగిరి : యాదాద్రి భువనగిరి ప్రెస్  సొసైటీ సభ్యులకు అండగా ఉంటామని రాబోవు రోజులల్లో భీమా సౌకర్యం, 5 లక్షలకు పాలసీ అమలు చేయడానికి కృషి చేస్తామని అధ్యక్షుడు గొట్టం రెడ్డి అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి ప్రెస్ సొసైటీ అధ్వర్యంలో భువనగిరి మండలం ముత్తురెడ్డి గూడెం గ్రామానికి చెందిన విలేఖరి బొల్లేపల్లి కిషన్ తల్లి అనారోగ్యంతో మరణించడంతో  యాదాద్రి భువనగిరి ప్రెస్ సొసైటీ తరుపున ఆర్థిక సహాయం రూ.28,500 /- నగదు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అద్యక్షులు నీల కిరణ్, ప్రధాన కార్యదర్శి గంధమల్ల రాజు,  ఉపాధ్యక్షులు గడ్డమీది   చంద్రయ్య, కోశాధికారి ఆరె కుమార్, సహాయ కార్యదర్శి మెరుగు అనిల్, ప్రచార కార్యదర్శి పాశం నవీన్ , సభ్యులు కూరెల్ల మల్లేష్, మహేష్, రాజు, నర్సింహ్మ చారి, సిద్దుల శివ, పల్లె కుమార్, ఎ. సురేష్   పాల్గొన్నారు.