బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

యాదగిరిగుట్ట,ముద్ర న్యూస్:- యదగిరిగుట్ట పట్టణంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల ఐలయ్య సమక్షంలో ఘనంగా భావి ప్రధాని రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు.కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సంధర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.రాబోయే రోజుల్లో దేశానికి,అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలంటే రాహుల్ గాంధీ  ప్రధాన మంత్రి కావాలన్నారు.పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు..భారత్ దేశంలో,తెలంగాణ రాష్ట్రంలో కుల మతాల మధ్య రాజకీయం చేస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ 150రోజులు 4వేల కిలో మీటర్లు పాదయాత్ర చేసి పేద ప్రజల కష్టాలు తెలుసుకొని ఏకం చేసారని అన్నారు.కావున ప్రజలంతా ఏకైమై రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రి చేయాలని తెలిపారు.అటు కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చుకోవాలని కోరారు.