ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత ఏటెల్లి శ్రీనివాస్ ను సన్మానించిన నారాయణపేట ఎస్.ఐ. శీనయ్య

ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత ఏటెల్లి శ్రీనివాస్ ను సన్మానించిన నారాయణపేట ఎస్.ఐ. శీనయ్య

ముద్ర రామన్నపేట న్యూస్ : యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు ఏటెల్లి శ్రీనివాస్ ను బుధవారం  అయన నివాసంలో నారాయణపేట ఎస్.ఐ. శీనయ్య గారు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టు వృత్తిలో రాణిస్తూ ఉత్తమ జర్నలిస్టు గా అవార్డు పొందడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి అవార్డులు మరెన్నో పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు భైరబోయిన రమేష్,కనతల శశిధర్ రెడ్డి, బూరుగు వెంకటేశం, ఎం. డి. తకియో ద్దీన్,మీర్జా హర్షద్ బేగ్,కొండ మల్లేష్ పాల్గొన్నారు.