ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి 

ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి 

ముద్ర ప్రతినిధి భువనగిరి :ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టరేటు సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన 11 ఫిర్యాదులను స్వీకరించారు.ఇందులో రెవెన్యూ శాఖ 10, జిల్లా పంచాయతీ అధికారి ఒకటి ఉన్నాయి. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎ.భాస్కరరావు, జిల్లా రెవిన్యూ అధికారి పద్మజారాణి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాసరాజు,  అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.