సిరిగిరి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ముదిరాజ్ సంఘం అధ్యక్షులు.....

సిరిగిరి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ముదిరాజ్ సంఘం అధ్యక్షులు.....

ఆలేరు (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని శర్బనాపురం గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు ఎద్ లింగయ్య ఆధ్వర్యంలో సంఘం సభ్యులు ఎద్ వెంకటేష్. వట్టెపు సత్యనారాయణ. ఎద్ అంజయ్య. ఎద్ నరసింహులు లు సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ మండల కార్యనిర్వహక అధ్యక్షులు సిరిగిరి విద్యాసాగర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు మెడలో కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వట్టేపు వెంకటేష్. శ్రీశైలం తో పాటు తదితరులు పాల్గొన్నారు....