జనగాం జిల్లా వల్మిడిలో సీతారామచంద్ర స్వామి ఆలయ పునర్ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు
ముద్ర, తెలంగాణ బ్యూరో:-ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ. . . . . .
- వల్మీడిలో శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయాన్ని పునర్ నిర్మించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదృష్టవంతుడు .
- వాల్మీకి పుట్టిన ఊరు వాల్మీకిపురం కాలక్రమేణా వల్మీడిగా మారింది.
- ఇక్కడే ఆది కావ్యం రామాయణాన్ని వాల్మీకి మునుల గుట్ట మీద రాశారు అని ప్రతీతి.
- శ్రీ రామానుజుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు.. ఇక్కడి రెండు గుట్టల మధ్య కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు చేసేలా ముందుకు వెళ్తాం.
- గుండెల నిండా భక్తి భావాన్ని కలిగిన వారు మన సీఎం కేసీఆర్.
- సీఎం కేసీఆర్ దేవాలయాలు నిర్మించడమే కాదు.. నిర్మించిన అన్ని దేవాలయాల్లో దీప దూప నైవేద్యాలు కార్యక్రమం జరిగేలా కృషి చేస్తున్నారు.
- రాష్ట్రంలో 3700 దేవాలయాలకు దూప దీప నైవేద్యాల కింద నిధులు కేటాయిస్తున్నాం .
- కొత్తగా చేర్చే దేవాలయాలతో ఆ సంఖ్య 7 వేలకు పైగా దాటింది.
- దీప దూప నైవేద్యాలు కోసం ఇచ్చే రూ. 6 వేలను రూ. 10 వేలు చేశారు.
- ఆధ్యాత్మిక భావనతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు.
- సీఎం కేసీఆర్ భగవంతుడి నమ్ముతారు.. యాగాలు చేస్తారు.
- అందుకే 10 ఏళ్లుగా మంచి వర్షాలు పడ్డాయి.. కరువు కాటకాలు రాలేదు.
- పరిపాలకులు దేవుడికి సేవ చేస్తే కృప ఉంటుంది.
- యాదాద్రి, కొండ గట్టు, భద్రాద్రి, కాళేశ్వరం ఆలయాలు సహా అనేక ఆలయలు నిర్మిస్తున్నారు.
- ప్రజల్లో భక్తి భావం పెంచడంతో పాటు దేవుడు ముందు అందరూ సమానులే అనే విధంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారు.
- మా కేబినెట్ లోనే అత్యధిక అవార్డులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శాఖకు వచ్చాయి.
- దేశంలో 3 శాతం జనాబా ఉన్న తెలంగాణకు 38 శాతం అవార్డులు వచ్చాయి.
- ఉత్తమ గ్రామాలు, జిల్లాలుగా తెలంగాణకే అన్ని అవార్డులు వచ్చాయి.
- ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా మంచి నీరు అందిస్తున్నాం.
- మిషన్ భగీరథకు రాని అవార్డు లేదు.
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశారు
- హెలికాప్టర్ లో వస్తుంటే ఈ ప్రాంతం పంటలతో పచ్చగా.. చెక్ డాంలన్నీ నీళ్లు నిండి ఉన్నాయి
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తనను నమ్ముకున్న ప్రజల కోసం ఎంతో కష్టపడతారు.