కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ లో చేరిక    

కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ లో చేరిక    

ముద్ర,రాజాపేట న్యూస్ :రాజపేటకు చెందిన మహమ్మద్ బాబర్ అలీ, వరిమడ్ల శీను లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం రాజాపేట లో డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ముఖ్యమంత్రి గా , గొంగిడి సునీత ఎమ్మెల్యే గా హట్రిక్ విజయం సాధించనున్నారని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కంటే భారీ మెజార్టీ ఆలేరులో రానుంది అన్నారు. ఈ నెల 29న ఆలేరులో జరిగే కెసిఆర్ భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సందిల భాస్కర్ గౌడ్,  సట్టు తిరుమలేశ,  ఎడ్ల బాలలక్ష్మి,  బెడిద వీరేశం,  బోగ హరినాథ్,  గుర్రం నర్సింలు,  ఎర్ర గోకుల జస్వంత్, మొగిలి ఇస్తారి, చింతల దాసు, ఎర్రగోకుల చంద్రయ్య, కాకల్ల ఉపేందర్ ,ఎర్ర గోకుల రాజు గొల్లెన రాజు, పోసుకొండ రాములు, విష్ణు ఎర్రగోకల మల్లయ్య తదితరులు ఉన్నారు.